Events

TDP-Janasena Mahila karykarta to Samavesam
March 15, 2024    

TDP-Janasena Mahila karykarta to Samavesam

Dr.Pemmasani Chandra Sekhar held a Meet with TDP-Janasena Mahila karyakarta.
Meeting at Kollipara
March 14, 2024    

Meeting at Kollipara

ఈ గడ్డ పెమ్మసాని అడ్డా. * వందల లారీల ఇసుక తరలించకపోతున్నారు. * భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. * మా జోలికొస్తే మాత్రం గాంధీగిరి చెల్లదు * కొల్లిపర మండల టిడిపి-జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘నేను ఈరోజు ఇంతటి వాడిని కావడానికి అమెరికాలోని శ్వేత, నల్ల జాతీయులే కారణం. నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ, నా కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోం, చెయ్యి ఎత్తుతానంటే గాంధీగిరి అంటూ కూర్చోలేం. ఈ గడ్డ పెమ్మసాని అడ్డాగా మార్చి తీరుతాం.’ అంటూ టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తెనాలి, కొల్లిపర, అంగలకుదురు తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు.  ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాక భారీ వాహనాల ప్రయాణాల వల్ల రోడ్లన్నీ గుంతలు పడిపోయి వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతున్నాయని తెలిపారు. సాయంత్రం అంగలకుదురు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పెమ్మసాని అనంతరం రోడ్డు షో లో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామ వీధుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి అందరిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు వీరవల్లి మురళి, గ్రామ ఉపసర్పంచ్ కనగాల నాగభూషణం, జడ్పిటిసి అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
TDP,Janasena, BJP Padayatra in Tenali
March 14, 2024    

TDP,Janasena, BJP Padayatra in Tenali

Dr Pemmasani Chandra Sekhar along with Janasena And BJP Leaders has been attended to Padayatra in Tenali Constituency.
Dr Pemmasani's Public Event
March 14, 2024    

Dr Pemmasani's Public Event

Tags: No Categories
Roadshow at Anganakuduru
March 14, 2024    

Roadshow at Anganakuduru

On March 14th a roadshow had been held at Anganakuduru which led to successful finish.

Sand Mafia - Tenali
March 14, 2024    

Sand Mafia - Tenali

వందల లారీల ఇసుక తరలించకపోతున్నారు. * భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. * మా జోలికొస్తే మాత్రం గాంధీగిరి చెల్లదు * కొల్లిపర మండల టిడిపి-జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘నేను ఈరోజు ఇంతటి వాడిని కావడానికి అమెరికాలోని శ్వేత, నల్ల జాతీయులే కారణం. కానీ ఏపీలోని ఈ ప్రభుత్వం దిక్కుమాలిన కుల రాజకీయాలతో అంటకాగుతోంది. నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ, నా కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోం, చెయ్యి ఎత్తుతానంటే గాంధీగిరి అంటూ కూర్చోలేం. ఈ గడ్డ పెమ్మసాని అడ్డాగా మార్చి తీరుతాం.’ అంటూ టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తెనాలి, కొల్లిపర, అంగలకుదురు తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొల్లిపర మండల టిడిపి, జనసేన, బిజెపి నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తర్వాత ఆయన చేసిన అభివృద్ధిని వైఎస్ఆర్ కొనసాగించారని, కానీ జగన్ మాత్రం 33 వేల ఎకరాలు రాజధాని నిమిత్తం ఇచ్చిన రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఓవైపు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గంజాయి సరఫరా చేయిస్తూ యువత భవితవ్యంతో ఆడుకుంటున్నారు అని, మరోవైపు తెనాలి ఎమ్మెల్యే నదీ జలాల్లోని ఇసుకను అడ్డగోలుగా అక్రమ రవాణా చేయిస్తున్నారని, ఇలా ప్రజా జీవితంతో ఆటలాడుకుంటున్న దుర్మార్గపు నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాక భారీ వాహనాల ప్రయాణాల వల్ల రోడ్లన్నీ గుంతలు పడిపోయి వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతున్నాయని తెలిపారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని తాము నమ్ముతామే తప్ప, తమ జోలికొస్తే మాత్రం గాంధీ గిరి అంటూ చేతులు కట్టుకుని కూర్చోబోమని ఆయన ఈ సందర్భంగా కొందరు వైసీపీ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. తమకు, తమ పార్టీకి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అనంతరం టిడిపి జనసేన కూటమి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొల్లిపర మండలం వ్యవసాయపరంగా ఎంతో వృద్ధి చెందిందని, తాగు, సాగు నీటి అవసరాల రీత్యా తాను ఎన్నో సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన రూ. లక్ష సాయం అందించారని, ఆ జాబితాలో కొల్లిపర రైతులు ఉండడం చూసి తన గుండె తరుక్కుపోయింది అన్నారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఏ ఒక్క ఓటు దారి మళ్లకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘ అధ్యక్షుడు వంగా సాంబి రెడ్డి తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. పర్యటన వివరాలు. ఉదయం నందులపేటలోని స్థానిక కాళీ మాత దేవస్థానంలో దర్శనం చేసుకున్న డా. పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం స్థానిక కవిరాజా పార్కు రోడ్డు, లెనిన్ రోడ్డు, టీ ఎన్ సీ క్లబ్ రోడ్డు, యడ్లపాడు వెంకటరావు రోడ్డు, బీసీ కాలనీ, నరేంద్ర దేవ్ కాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పర్యటించారు. పలుచోట్ల అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సాయంత్రం అంగలకుదురు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పెమ్మసాని అనంతరం రోడ్డు షో లో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామ వీధుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి అందరిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు వీరవల్లి మురళి, గ్రామ ఉపసర్పంచ్ కనగాల నాగభూషణం, జడ్పిటిసి అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
21st Ward Ratnala cheruvu Padyatra
March 13, 2024    

21st Ward Ratnala cheruvu Padyatra

Dr Pemmasani Chandrasekhar  Visited Mangalgiri Constituency 21st Ratnala Cheruvu Padaythra
Meet at KL University
March 13, 2024    

Meet at KL University

నిజమైన నాయకుడిని ఎన్నుకోండి. * విద్యార్థులతో డా. పెమ్మసాని. ‘మెజారిటీ సీట్లు ఇవ్వండి, పనిచేయకపోతే ప్రశ్నించండి.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కే ఎల్ యూ కాలేజీ ఆవరణలో బుధవారం జరిగిన ‘ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చైతన్యవంతులైతే రాక్షస పాలనకు స్వస్తి పలికినట్టేనని, రూ. 5 వేల జీతాలకు వాలంటీర్ ఉద్యోగాలు చేతిలో పెట్టి, వేలకొద్దీ ఉద్యోగాలు ఇచ్చేసామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మన అమరావతి కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరిగేదని పెమ్మసాని తెలిపారు. సమీప భవిష్యత్తులో జగన్ కనిపించకుండా యువత ఓటు వేయాలని ఆయన యువతను కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా కో – ఆర్డినేటర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ మోదీ దగ్గరకు వెళ్ళి అమరావతి గురించి మాట్లాడగల తొలి వ్యక్తి పెమ్మసానేనని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత పడవల మహేష్, గుంటూరు పార్లమెంటరీ తెలుగు యువత జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Meeting with Differently abled  cell
March 13, 2024    

Meeting with Differently abled cell

గుంటూరు…దివ్యంగుల ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ విభిన్న ప్రతిభావంతులు ఎన్ని కష్టాలు ఉన్న బాధలు ఉన్న పోరటమే ధ్యేయంగా పనిచేసి బ్రతుకు బాటలో నడుస్తున్న వ్యక్తులు … అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని నిరూపించిన మిమ్మల్ని చూస్తే నాకు ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అనిపిస్తుంది.. అమెరికాని యుద్ధభూమిలో ముందుండి నడిపిన వ్యక్తి దివ్యంగుడన్నవిషయం మీకు తెలుసా అని గుర్తు చేశారు… సమాజంలో దివ్యంగులు సైతం సేవకార్యక్రమలు చేయడం చూస్తే సంతోషం కలుగుతుంది…  మీకు రావలసిన ఫెంక్షన్ పెంపు చేయడం కోసం శక్తియుక్తుల పోరాటం చేస్తాను… నేను గెలిచిన తర్వాత రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మీ సమస్యలపై నా గళం విప్పుతాను అని హామీ ఇచ్చారు….. మసిల్ డిజార్డర్ ఉన్న దివ్యంగులకు కావలసిన మందులు కోసం అంతర్జాతీయ మెడికల్ క్లబ్ తో మాట్లాడి మందులు అనేవిధంగా చూస్తాను…. దివ్యంగులకు స్కిల్ డెవలప్మెంట్ తో నా సొంత నిధులు సైతం వెచ్చించి మీకు తగు ఉపాధి కల్పిస్తానని అన్నారు… ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి,అవి మనకి కొలబద్ద కాదు వాటికి మీసమస్యలకు ఎలాంటి పొంతన లేదు…. మీకోసం నిత్యం ఎదురు చూస్తూ వుంటాను,నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీ సమస్యలు పరిష్కరించడానికి తెరిచే వుంటాయని హామీ ఇచ్చారు..
Dr Pemmasani's Public Event
March 13, 2024    

Dr Pemmasani's Public Event

Tags: No Categories